
అరటి కాయ.. అందరికీ తెలిసిందే.. అందరూ తినేదే.. అరటి కాయ కొన్ని సార్లు తెలుపు రంగు నుంచి లైట్ కాఫీ కలర్ లో కనిపిస్తుంది అప్పుడప్పుడు. అందరూ సాధారణంగా అనుకునేది ఏంటంటే.. బాగా మాగింది.. బాగా పండింది.. అందుకే అలా ఉంది అనుకుంటాం.. చాలా మంది ఏమీ కాదని అలా తినేస్తుంటారు.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే మాత్రం.. అరటి కాయ తినాలంటేనే భయమేస్తుంది. ఎందుకో తెలుసా.. మనం బాగా పండింది.. మాగింది అనుకునే అరటి కాయను.. పరీక్షలు చేయగా అందులో చిన్న చిన్న పురుగులు ఉన్నాయి.. ఈ వీడియో నిజమా ...కాదా.. నిజంగా అలాంటి అరటి కాయలో పురుగులు ఉంటాయా అనేది తెలియకపోయినా.. వీడియో చూసినోళ్లు అందరూ మాత్రం.. షాక్ అవుతున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే..సాధారణంగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అరటి పండ్లను తింటుంటారు. కొంతమంది అన్నంలో కూడా తింటారు. దీనిలో అనేక రకాలైన ఎంజైమ్ లతో పాటు ఖనిజాలు విటమిన్లు ఉంటాయి. అరటి పండు బాగ మాగిన తరువాత (గోధుమరంగులోకి వచ్చిన )రుచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు పండిన అరటి పండ్లపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. బాగా పండిన... మాగిన అరటి పండ్లలో పురుగులు కనిపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
ఈ వీడియోలో పండిన అరటిపండుని కట్ చేసి గోధుమరంగు భాగాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూపించారు. ఈ భాగాలలో కీటకాలు ఉన్నాయి, ఇవి మైక్రోస్కోప్తో మాత్రమే కనిపిస్తాయి.
ఆ తర్వాత మైక్రోస్కోప్ లెన్స్ సహాయంతో జూమ్ చేయగా, దాని లోపల చాలా క్రిములు ఉన్నట్లు కనిపించాయి. ఈ బ్యాక్టీరియా కారణంగా, పండిన అరటిపండ్లలోని ఈ గోధుమ రంగు భాగాలను తినవద్దని వీడియో తయారీదారు సూచించారు. అయితే ఆ వీడియో షేర్ కావడంతో అది కాస్తా వ్యాపించింది.
ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు భిన్నమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలిపారు. తాను ... పండిన అరటిపండ్లను తిననని ఒక వ్యక్తి రాశాడు. చాలా మంది మాత్రం ఈ వీడియో సమాచారాన్ని ఫేక్ అని చెప్పారు. కొంతమంది ఈ బాక్టీరియా కడుపుకు మంచిదని చాలామంది రాశారు. ఏదైనా ఆహార పదార్థాన్ని మైక్రోస్కోప్తో చూస్తే అందులో బ్యాక్టీరియా ఉంటాయని మరికొందరు కామెంట్ చేశారు. చెడిపోని పండు అరటిపండు అని చాలా మంది రాశారు. పండిన అరటిపండ్లు తినడం హానికరం కాదని నిపుణులు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.