పీఎల్ఐ స్కీమ్‌‌‌‌‌‌‌‌ అర్హతకు రూ.50 కోట్లు పెట్టుబడి

పీఎల్ఐ స్కీమ్‌‌‌‌‌‌‌‌ అర్హతకు రూ.50 కోట్లు పెట్టుబడి

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్​ ప్రొడక్టులు తయారుచేసే డిక్సన్ టెక్నాలజీస్ ప్రొడక్షన్ లింక్డ్‌ ఇన్సెంటివ్​ (పీఎల్​ఐ) స్కీము కింద లాభాలు పొందనుంది. ఇండియాకు చెందిన ఈ కాంట్రాక్టు మానుఫ్యాక్చరర్​ స్మార్ట్​ఫోన్ల తయారీకి పీఎల్ఐకి కింద ఇన్సెంటివ్​లు పొందిన మొదటి కంపెనీ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2021 అక్టోబరు–డిసెంబరు క్వార్టర్​కు  కంపెనీ దాదాపు రూ. 53 కోట్లను ఇంక్రిమెంటల్ సేల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రాయితీగా పొందడానికి అర్హత సాధించింది. ఇన్సెంటివ్ మొత్తాన్ని రానున్న కొద్ది రోజుల్లో కంపెనీకి అందజేయనున్నారు.

కంపెనీ ఇప్పటి వరకు అక్టోబర్ క్వార్టర్​కు మాత్రమే ఇన్సెంటివ్‌‌‌‌‌‌‌‌లను క్లెయిమ్ చేసింది. తమ కేసును ఎంపవర్డ్​ గ్రూపు ఆమోదించిందని, తమ సబ్​మిషన్లకు గ్రీన్​సిగ్నల్​ వచ్చిందని డిక్సన్ టెక్నాలజీస్ సీఎండీ  సునీల్ వచాని  చెప్పారు.  కంపెనీ  సబ్మిషన్లపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ గ్రూపు సెప్టెంబర్ 9న సమావేశం అయింది.  పీఎల్​ఐ ఇన్సెంటివ్స్​ కోసం డిక్సన్ టెక్నాలజీస్,  శామ్‌‌‌‌‌‌‌‌సంగ్ కూడా డాక్యుమెంట్లను సమర్పించాయి. యాపిల్ ​ప్రొడక్టుల కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్​కాన్​, విస్ట్రన్ సైతం ఇన్సెంటివ్​లను పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. డిక్సన్  దేశీయ తయారీ సంస్థ అయినందున స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ పీఎల్ఐ స్కీమ్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించడానికి రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టవలసి వచ్చింది.  మొదటి సంవత్సరంలో రూ. 500 కోట్ల విలువైన ఫోన్‌‌‌‌‌‌‌‌లను తయారు చేసింది.