ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే వివాదం మరింత ముదురుతోంది. మహువా డబ్బులు తీసుకుని మోదీకి వ్యతిరేకంగా పార్లమెంటులో ప్రశ్నలు అడిగారని బీజేపీ ఆరోపిస్తోంది. దీంతో దూబేవి నకిలీ డిగ్రీ పట్టాలు అంటూ ఆమె విమర్శించారు. దీనికి కౌంటర్గా ఇస్తూ.. ‘మహువా డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారా లేదా? అన్నది ప్రశ్న. నకిలీ డిగ్రీల గురించి, అదానీ గురించి కాదు. విదేశీ ప్రయాణాలకు ఖర్చులు ఎవరు భరించారు..? ఆ ప్రయాణాల కోసం లోక్సభ స్పీకర్, విదేశాంగ శాఖ అనుమతులు తీసుకున్నారా..? వంటి ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పాలి. ఈ డిగ్రీ హెల్డర్ డబ్బు కోసం మనస్సాక్షిని అమ్మేసుకున్నారు.. రేపు దేశాన్నికూడా అమ్మేయగలరు’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దుబే.
