డైరెక్ట్​ ట్యాక్సెస్ ​వసూళ్లు రూ. 14.71 లక్షల కోట్లు

డైరెక్ట్​ ట్యాక్సెస్ ​వసూళ్లు రూ. 14.71 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: 2022–-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి  ప్రత్యక్ష పన్ను వసూళ్లు  ఈ నెల పదో తేదీ వరకు రూ. 14.71 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.  పోయిన ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 24.58 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, నెట్​ ఆఫ్​ రీఫండ్స్​ విలువ రూ. 12.31 లక్షల కోట్లుగా రికార్డయింది. ఇది పోయిన సంవత్సరం ఇదే కాలానికి నికర వసూళ్ల కంటే 19.55 శాతం ఎక్కువ. ప్రత్యక్ష పన్నుల మొత్తం బడ్జెట్ అంచనాలలో ఇది 86.68 శాతం.