గురుగ్రామ్: సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారం చేసే కార్స్ 24డాట్ కామ్ లో క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ అంబాసిడర్ గానూ ఆయనను కంపెనీ నియమించుకుంది. ఆయన ఇన్వెస్ట్మెంట్ ‘సిరీస్ డి’ రౌండ్ ఫండింగ్ లో భాగమని కార్స్ 24 సహ వ్యవస్థాపకుడు, సీ ఈఓ విక్రమ్ చోప్రా తెలిపారు. ధోనీ ఎందరో ఇండియన్లకు ఆదర్శమని అన్నారు.
