సంజయ్ సింగ్​పై ఈడీ చార్జ్ షీట్ ఫైల్​

సంజయ్ సింగ్​పై ఈడీ చార్జ్ షీట్ ఫైల్​

 

న్యూఢిల్లీ :  ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) మరో సప్లిమెంటరీ చార్జిషీట్​ దాఖలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎంపీ సంజయ్ సింగ్​ పేరును చేర్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ కేసులో ఈడీ ఇప్పటికే 4 చార్జ్ షీట్​లు దాఖలు చేసింది. గత అక్టోబర్​లో ఎంపీ సంజయ్ సింగ్​ను అరెస్టు కూడా చేసింది. ఈడీ ఆరోపణల ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి వ్యాపారవేత్త దినేశ్​ అరోరా పలువురికి ముడుపులు చెల్లించినట్లు తెలిపింది.

ఇందులో భాగంగానే ఎంపీ సంజయ్  సింగ్​ కు ఆయన నివాసంలోనే రూ.2 కోట్లు అందించానని అరోరా వెల్లడించాడు. ఈ వ్యవహారం మొత్తం 2021–22 మధ్య కాలంలో జరిగిందని ఈడీ చార్జ్ షీట్​లో పేర్కొంది. అయితే, సంజయ్ సింగ్​ ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తనను అరెస్టు చేశారని మండిపడ్డారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన పెద్ద లీడర్లలో సంజయ్ సింగ్​ రెండో వాడు.. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ 
సిసోడియా ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.