నిందితురాలికి నేరంతో సంబంధం ఉంది

నిందితురాలికి నేరంతో సంబంధం ఉంది

న్యూఢిల్లీ: ఎంప్లాయీస్​ ఫోన్​ ట్యాపింగ్​,​ కో–లొకేషన్​  ​కేసుల్లో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇ) మాజీ మేనేజింగ్ డైరెక్టర్,  చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చిత్రా రామకృష్ణ బెయిల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రత్యేక కోర్టు సోమవారం కొట్టివేసింది. అంతకుముందు  ఈడీతో పాటు నిందితుల తరపున వాదనలు విన్న న్యాయమూర్తి సునైనా శర్మ బెయిల్​ పిటిషన్​పై ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. విచారణ సందర్భంగా ఈడీ లాయర్ మాట్లాడుతూ ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని, నిందితురాలికి నేరంతో "ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా"  సంబంధం ఉందని పేర్కొంటూ బెయిల్ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకించారు.  

2009 నుంచి 2017 వరకు, ఎన్​ఎస్​ఈ మాజీ సీఈఓ రవి నారాయణ్​, చిత్ర రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవి వారణాసి,  హెడ్ (ప్రిమైసెస్​) మహేష్ హల్దీపూర్ తదితరులు కలిసి కో–లొకేషన్​ స్కామ్​ కోసం ఎన్​ఎస్​ఈ  ఉద్యోగులను మోసం చేయడానికి కుట్ర పన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కోసం ఐసెక్ అనే సంస్థ​ సేవలు వాడుకున్నారు. సైబర్ మోసాలపై పీరియాడిక్ స్టడీ అంటూ ఎన్​ఎస్​ఈ ఉద్యోగుల ఫోన్ కాల్స్​ను చట్టవిరుద్ధంగా విన్నారు. ఇందుకోసం ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ ఉద్యోగుల నుంచి పర్మిషన్​ తీసుకోలేదని ఈడీ ఆరోపించింది.