బిహార్​లో దళితులపై దారుణం

బిహార్​లో దళితులపై దారుణం

ఔరంగాబాద్: పైసల్​ తీస్కొని కూడా తనకు ఓటెయ్యలేదని పంచాయతీ ఎన్నికల్లో ఓడిన ఓ కేండిడేట్​ ఇద్దరు దళితులపై దాడి చేసిండు. వీధిలో నిలబెట్టి తిడుతూ, వారితో గుంజీలు తీయించిండు. రోడ్డుపై ఉమ్మేసి వారితో బలవంతంగా నాకించిండు. బిహార్​లోని ఔరంగాబాద్​లో జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో వైరల్​గా మారింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఔరంగాబాద్​ జిల్లాలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. పంచాయతీ హెడ్​గా పోటీచేసిన బల్వంత్​ సింగ్​ ఓడిపోయిండు. తన ఓటమికి కారణం దళితులు ఓటేయకపోవడమేనని భావించి ఆవేశంతో రగిలిపోయిండు. ఇద్దరు దళితులను వెతికిపట్టుకుని వారిపై తిట్లదండకం చదివిండు. అంతటితో ఆగక వారితో రోడ్డుపై గుంజీలు తీయిస్తూ దాడి చేసిండు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి నెట్​లో పెట్టడంతో వైరల్​గా మారింది. అయితే, ఆ ఇద్దరు యువకులు మందు తాగి రోడ్డుపై న్యూసెన్స్ చేస్తున్నారని, వారికి బుద్ధి చెప్పేందుకే గుంజీలు తీయించానని బల్వంత్​ సింగ్​ వివరణ ఇచ్చాడు. వీడియోలో మాత్రం ఎన్నికల్లో తనకు ఓటేయడానికి వారికి డబ్బిచ్చినట్లు బల్వంత్​ చెప్తున్నట్లు ఉంది.