- పాక్ తీరం వైపు కదులుతున్న తుఫాన్
న్యూఢిల్లీ: గుజరాత్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలకు కారణమైన అల్పపీడనం శుక్రవారం ఉదయం తుఫాన్గా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం తుఫాన్గా మారిందని, అది గుజరాత్ తీరం నుంచి దూరంగా పాక్ వైపు కదులుతోందని తెలిపింది. ఈ తుఫాన్కు పాక్ సూచించిన మేరకు ‘అస్నా(గుర్తించదగ్గది లేదా పొగడదగ్గది)’ అని నామకరణం చేసినట్టు పేర్కొంది. 1976వ సంవత్సరం నుంచీ ఆగస్టు నెలలో అరేబియాలో తుఫాన్ ఏర్పడటం ఇది నాలుగోసారి అని ప్రకటించింది.
ఇంతకుముందు 1944, 1964, 1976 సంవత్సరాల్లోని ఆగస్టు నెలల్లో మాత్రమే అరేబియాలో తుఫాన్ ఏర్పడిందని, అవి బలహీన తుఫాన్లుగానే నమోదయ్యాయని వివరించింది. తాజాగా ఏర్పడిన సైక్లోన్ అస్నా గుజరాత్ లోని భుజ్ కు 190 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, అది మరో రెండు రోజుల్లో భారత తీరానికి దూరంగా వెళ్లిపోతుందని పేర్కొంది.