వేస్ట్ అని మనం పారేస్తున్నాం.. వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు

వేస్ట్ అని మనం పారేస్తున్నాం.. వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు

ప్రపంచంలో  ప్రతి వస్తువు దేనికొకదానికి ఉపయోగపడుతుంది.  కాని మనకు వాటి ఉపయోగం మనకు తెలియక పోవడంతో వాటిని  పనికిరాని పాత వస్తువుల మాదిరిగా పారేస్తుంటాము.  ప్రస్తుతం ఇళ్లల్లో సాధరణంగా పాత టైర్లు( వాహనాలవి), డబ్బాలు, పాడయిపోయున కుర్చీలు, టేబుల్స్ మొదలైన వాటిని చెత్త బండి వచ్చినప్పుడు అందులో వేస్తాము.  కాని యూపీ కి చెందిన ఓ జంట మాత్రం చేయరు.  అలాంటి వాటి నుంచి కూడా డబ్బు సంపాదిస్తున్నారు. 

యూపీకి చెందిన గౌతం భారతి..ఓ కంపెనీ ప్రారంభించారు.  అంతకు ముందు ఆమె ఢిల్లీలో క్రియేటివ్ ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. అవనీ జైన్  బన్స్వారా నివాసి.. ఇతను వృత్తి రీత్యా ప్యాషన్ డిజైనర్. వీరు పనికిరాని, పాత వస్తువులను పారేయకుండా  ఉపయోగించి డబ్బు సంపాదిస్తూ..గిరిజన యువతకు సంపాదనతో పాటు ఉపాధి కూడా  కల్పిస్తున్నారు.  పాడైపోయన ఫర్నీచర్ వస్తువులతో వీరిద్దరు కలిసి తయారు చేసిన వస్తువులు, డిజైన్లు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్రస్తుతం వీరు  IIFL ఫౌండేషన్, మునిసిపల్ కౌన్సిల్ దుంగార్‌పూర్ , ముస్కాన్ సంస్థాన్‌లతో కలిసి పనిచేస్తున్నారు.  ఇప్పటి వరకు 3 టన్నుల టైర్లు, 3000కు పైగా బాటిళ్లు, 15000 కిలోల ఇనుముతో ఎంతో అందమైన వస్తువులను తయారు చేసి విక్రయించారు. 

గతంలో  ఢిల్లీ , డెహ్రాడూన్‌లలో క్రియేటివ్ టీచర్‌గా పనిచేసేటప్పుడు మనస్సు ఎప్పుడూ ప్రశాంతతగా లేదని గౌతం భారతి అన్నారు.  నాలుగేళ్ల క్రితం  శిక్షణా కేంద్రం ప్రారంభించామన్నారు. ఇక్కడి గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి మార్గం చూపడమే వారి లక్ష్యమని వారు చెబుతున్నారు.  తాను ఫ్యాషన్ డిజైనర్‌ని అయ్యానని, అయితే ల్యాప్‌టాప్‌లో పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టం లేదని అవనీ జైన్ చెప్పారు.  ఓ రోజు వర్క్‌షాప్‌లో కలిసిన వీరిద్దరు  కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.