షాద్ నగర్,వెలుగు: ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణ వాసుల కలలు సాకారం అవుతాయని షాద్ నగర్ సెగ్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్ తెలిపారు. మంగళవారం షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 23,24 వార్డుల్లో ఆయన ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అరాచకాలకు, దౌర్జన్యాలకు అడ్డాగా మారిందన్నారు. ప్రశ్నించే వాళ్లను కేసుల పేరుతో బీఆర్ఎస్ సర్కారు ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అనంతరం బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు వీర్లపల్లి శంకర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. శంకర్ వెంట పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య, తిరుపతిరెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత దంగు శ్రీనివాస్ యాదవ్, ఖదీర్, నల్లమోని శ్రీధర్, సుదర్శన్, కాంగ్రెస్ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.
ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తం: వీర్లపల్లి శంకర్
- రంగారెడ్డి
- November 15, 2023
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.