ఆర్​బీఐ ఆదేశాలతో ఫిన్​టెక్​లకు చిక్కులు

ఆర్​బీఐ ఆదేశాలతో ఫిన్​టెక్​లకు చిక్కులు

న్యూఢిల్లీ:  లిబరలైజ్డ్​రెమిటెన్స్​ స్కీమ్​ (ఎల్‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌ఎస్) కింద అన్ని లావాదేవీలను నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్ (ఎస్‌‌‌‌బిఎమ్) ఇండియాను కొన్ని రోజుల కిందట ఆర్​బీఐ ఆదేశించడంతో అనేక భారతీయ ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌లు ఇబ్బందిపడుతున్నాయి. రెమిటెన్స్​సేవలు అందించే నియో బ్యాంకింగ్ ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌లు నియో,  జోల్వ్‌‌‌‌ సమస్యలు ఎదుర్కొంటున్నాయి.  ఆర్​బీఐ ఆదేశాల ఎఫెక్ట్​ ఎక్కువగానే ఉందని ఇండ్‌‌‌‌మనీ,  వెస్టెడ్ ఫైనాన్స్ వంటి యూఎస్- స్టాక్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్ ప్లాట్‌‌‌‌ఫారమ్‌‌‌‌లు, ఇండస్ట్రీ లీడర్లు చెప్పారు. నియో తన ఫారెక్స్ కార్డ్ అంతర్జాతీయ లావాదేవీలను తాత్కాలికంగా ఆపివేసింది.  

ఎస్​బీఎం ఇండియా ఎల్​ఆర్​ఎస్​ లావాదేవీని నిలిపివేయడంతో కనీసం ఏడు లేదా ఎనిమిది ఫిన్‌‌‌‌టెక్‌‌‌‌ల వ్యాపారం ప్రభావితమయింది. ఎస్​బీఎం ఇండియాకు కనీసం 35 ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీలతో   భాగస్వామ్యం ఉంది. ఇది భారతదేశంలో చెల్లింపుల కోసం బుక్​మై ఫారెక్స్, ఇన్​స్టారెమ్​, హాప్​రెమిట్​ వంటి వాటితో కూడా పని చేస్తుంది. 2004లో  ఆర్​బీఐ ప్రవేశపెట్టిన ఎల్​ఆర్​ఎస్​ స్కీమ్ ప్రకారం భారతదేశంలోని వ్యక్తి ప్రతి ఆర్థిక సంవత్సరానికి  2,50,000 డాలర్ల వరకు వరకు   పంపుకోవడానికి అనుమతి ఉంటుంది. ఆర్​బీఐ నిర్ణయం వల్ల ఎస్​బీఎం ఇండియా కస్టమర్లు తమ డెబిట్​కార్డులను  వాడుకోవడం సాధ్యం కావడం లేదు.