స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ మంగళవారానికి (అక్టోబర్ 17) సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈరోజు ( అక్టోబర్ 13) సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. జీఎస్టీ డీజీ రిపోర్ట్ను సీఐడీ కోర్టుకు అందించింది. చంద్రబాబు తరపున సాల్వే, సింఘ్వీ, సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ, వాదించారు. స్కిల్ స్కాంపై 2021లోనే ఎఫ్ఐఆర్ నమోదైందని, 2017కు ముందు కేసు నమోదైందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని సిద్దార్థ్ లూథ్రా వాదించారు. చంద్రబాబును అనేక కేసులతో ఇబ్బంది పెడుతున్నారని లూథ్రా కోర్టుకు తెలిపారు. ఫైబర్ నెట్ కేసులో కూడా 17 ఎ చట్టం వర్తిస్తుందని లూథ్రా వాదించారు. చంద్రబాబు తరపు లాయర్ల వాదనలను సీఐడీ తరపు న్యాయవాది రోహత్గీ తప్పు పట్టారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేశారు.
చంద్రబాబు క్వాష్ పిటిషన్ అక్టోబర్ 17కు వాయిదా
- ఆంధ్రప్రదేశ్
- October 13, 2023
మరిన్ని వార్తలు
-
Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
-
Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.