PF ఖాతాదారులకు కేంద్రం షాక్ ఇచ్చింది.. గత ఆర్థిక సంవత్సరం డిపాజిట్లపై వడ్డీరేటును తగ్గించింది. ఇంతకు ముందు ఉన్న 8.5 శాతం ఉన్న వడ్డీ రేటును 8.1 శాతానికి కుదిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫండ్ పై వడ్డీ రేటును స్థిరంగానే ఉంచిన కేంద్రం.. దానికన్నా ముందు EPFO వడ్డీ రేటును తగ్గించింది. 45 ఏండ్లల్లో ఇదే తక్కువ వడ్డీ రేటని అధికారులు తెలిపారు. వడ్డీరేట్లు తగ్గించడం వల్ల 6 కోట్ల మందిపై ప్రభావం పడనుంది.
Govt approves 8.1 pc rate of interest on employee provident fund deposits for 2021-22: EPFO office order
— Press Trust of India (@PTI_News) June 3, 2022
మరిన్ని వార్తల కోసం...
