యాపిల్​ దిగుమతులపై కేంద్రం నిషేధం

యాపిల్​ దిగుమతులపై  కేంద్రం నిషేధం

కశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​లోని యాపిల్​లకు విదేశీ యాపిల్​ పండ్లతో పోటీ పెరిగినందున, కిలోకు రూ.50 కంటే తక్కువ ఉన్న పండ్ల దిగుమతిని భారత్​ నిషేధించింది. యాపిల్ సీఐఎఫ్​(ధర, బీమా, సరకు) ధర రూ.50 కంటే ఎక్కువగా ఉంటే దిగుమతులు ఉచితంగా చేయవచ్చు. భూటాన్​ నుంచి వచ్చే పండ్లకు దిగుమతి ధర వర్తించదని డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్ ఫారిన్​ ట్రేడ్​ (డీజీఎఫ్​టీ) నోటిఫికేషన్​లో పేర్కొంది.

ఇరాన్​, టర్కీ నుంచి పోటీ...

కశ్మీర్​, హిమాచల్​ప్రదేశ్​ యాపిల్​ లు ఇరాన్​,టర్కీ ఉత్పత్తుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నాయి. ఈ నిషేధం కశ్మీర్​, హిమాచల్​ రైతులను రక్షించడానికే తీసుకున్నట్లు భారత ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.