ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) గడువు తేదీని పొడిగించింది. సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించడానికి చివరి తేదీ జులై 31 కాగా..ప్రభుత్వం ఆ గడువు తేదిని ఆగస్టు 31వ తేదీ వరకూ మరో నెల రోజులు పెంచింది. ఇప్పటి వరకు పన్ను చెల్లించని వారుంటే ఆగష్టు 31 లోగా రిటర్నులను సమర్పించాలని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ కోరింది. ఈ గడువు లోపు చెల్లించనట్లయితే రూ.5000 ఫైన్ తో డిసెంబర్ 31, 2019 కల్లా రిటర్నులు దాఖలు చేయాలని తెలిపింది.
