లండన్ నుంచి వచ్చి ఢిల్లీలో ఎస్కేప్..

లండన్ నుంచి వచ్చి ఢిల్లీలో ఎస్కేప్..
ఐసోలేషన్ సెంటర్ నుంచి పారిపోయిన మహిళ రాజమండ్రిలో పట్టుకున్న హెల్త్ స్టాఫ్ అమరావతి:  లండన్​ నుంచి వచ్చిన ఓ మహిళకు ఢిల్లీలోనే పాజిటివ్ అని​తేలినా అధికారులకు చెప్పకుండానే ఆమె ట్రైన్​లో  సొంతూరు రాజమండ్రికి రావడం కలకలం రేపింది. ఢిల్లీ పోలీసుల సమాచారంతో అప్రమత్తమైన ఏపీ అధికారులు.. రాజమండ్రిలో బుధవారం రాత్రి ట్రైన్​దిగిన వెంటనే ఆమెను పట్టుకుని స్పెషల్​ ఐసోలేషన్​ సెంటర్ కు తరలించారు. రాజమండ్రిలో ఉండే ఆంగ్లో ఇండియన్​ ఫ్యామిలీ ఓ స్కూల్​లో పనిచేసేది. లాక్​డౌన్​లో స్కూల్స్​ లేక ఆమె భర్త లండన్​ వెళ్లారు. అక్కడ జాబ్​ చూడడంతో ఆ మహిళ కూడా లండన్​ వెళ్లగా కొడుకు ఇక్కడే ఉండిపోయాడు. కొడుకును చూసేందుకు ఈ నెల 21న  లండన్​నుంచి ఆమె ఢిల్లీ వచ్చింది. ఎయిర్​ పోర్టులో అధికారులు టెస్ట్​ చేయగా పాజిటివ్​గా తేలింది. దీంతో ఆమెను స్పెషల్​ క్వారంటైన్​సెంటర్​కు తరలించారు. అయితే ఆమె.. ఢిల్లీలో రిసీవ్​ చేసుకునేందుకు వెళ్లిన కొడుకుతో కలిసి అక్కడి అధికారులకు చెప్పకుండానే  ట్రైన్​లో రాజమండ్రికి  వచ్చేసింది. ఆ లోపే ఢిల్లీ క్వారంటైన్ ​అధికారులు ఏపీ రైల్వే పోలీసులు, హెల్త్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అధికారులు  బుధవారం అర్ధరాత్రి ట్రైన్​ దిగిన వెంటనే వాళ్లనుపట్టుకొని క్వారంటైన్​కు తరలించారు. ఆమెకు కొత్త స్ట్రెయిన్​ వల్ల పాజిటివ్​ వచ్చిందా? లేదా పాత స్ట్రెయినా? అన్నది తెలుసుకునేందుకు శాంపిల్స్​ను పూణే ల్యాబ్​కు పంపించారు.