2020 – 2021 ఆర్థిక సంవత్సర బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రచురణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి సూచికగా జరిపే హల్వా వేడుకలను ఢిల్లీలోని ఆర్థికశాఖ కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, పలువురు సీనియర్ ఆఫీసర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. బడ్జెట్ తయారీలో పాల్గొనే ఆఫీసర్లు ఇది పూర్తయ్యేదాకా పార్లమెంటులోని నార్త్బ్లాక్లోనే ఉండాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడాలన్నా వచ్చే నెల ఒకటిన బడ్జెట్ ప్రవేశపెట్టేవరకూ ఆగాల్సిందే!
