- పాక్ డ్రోన్ను కూల్చేసిన బీఎస్ఎఫ్ జవాన్లు
ఫిరోజ్ పూర్: ఇండియాలోకి అక్రమం గా ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ( బీఎస్ఎఫ్) బలగాలు శుక్రవారం కూల్చేశాయి. బీఎస్ఎఫ్ వెల్లడించిన వివరాల ప్రకా రం.. ఫిరోజ్ పూర్ జిల్లాలోని మాబోక్ గ్రామ సమీపంలో బీఎస్ఎఫ్ దళాలు డిసెంబర్ 8న రాత్రి 10 గంటలకు డ్రోన్ కదలికలను గుర్తించాయి. అప్రమత్తమైన జవాన్లు దానిని కూల్చేశారు. ఆ తర్వాత డిసెంబర్ 9న ఉదయం సెర్చ్ ఆపరేషన్ చేపట్టగా రోహిల్లా హాజిల్లా గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో ఓ చిన్న డ్రోన్ లభించింది.
రికవరీ చేసు కున్న డ్రోన్ను క్వాడ్ కాప్టర్ మోడల్గా బీఎస్ఎఫ్ జవాన్లు అనుమానిస్తున్నారు. గత కొంత కాలంగా పాక్ సరిహద్దు నుంచి ఇండియాలోకి అక్రమంగా డ్రోన్ల సహాయంతో ఆయుధాలు, నార్కొటిక్స్ ను స్మగ్లింగ్ చేస్తున్నారు. పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది.
