బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు  నిర్మించిన దేవాలయం ... ఎక్కడంటే..

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు  నిర్మించిన దేవాలయం ... ఎక్కడంటే..

కర్నాటక రాష్ట్రంలోని కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలోని కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి వినాయకుడి విగ్రహం పదమూడున్నర అడుగుల ఎత్తు ఉంది. సుమారు 14అడుగుల ఎత్తు ఉన్న ఈ భారీ విగ్రహం, ఏక సాలగ్రామ శిల. త్రిమూర్తులు ప్రతిష్టించారని ప్రతీతి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్టించారని ఇతిహాసం చెబుతుంది. ఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు. మరి ఈ దేవాలయ చరిత్ర… దేవాలయంలో కొలువైన గణపతి యొక్క మహిమల గురించి…

కర్ణాటక కోలారు జిల్లాలోని ముళబాగిలు పట్టణం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కురుడుమలె వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి.   ఈ దేవాలయంలో విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (త్రిమూర్తులు) ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయాన్ని రాముడు, కృష్ణుడు, పాండవులు కూడా దర్శించుకున్నారని గ్రంథాల్లో ఉందని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు.  వారు విజయాలు సాధించే ముందు ఈ దేవాలయంలో స్వామికి అర్చనలు జరిపి తాము తల పెట్టినకార్యములో విజయం సాధించాలని కురుడుమలె వినాయకుడిని ప్రార్థించారని ఆధ్మాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.  ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోర్కెలు నెరవేరుతాయనే విశ్వాసం.
 

త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతిని పూజించి కార్య విఘ్నాలు తొలగించుకున్నారని, త్రేతాయుగంలో ఈ స్వామిని సేవించి రాముడు లంకకు పయనమయ్యాడని, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు స్వామిని సేవించాడని, పాండవులు కూడా ఇక్కడ స్వామిని సేవించారని అక్కడ స్థల పురాణం. శ్రీకృష్ణదేవరాయలు వారికి స్వామి కలలో కనబడి ఆ గుడికి ప్రాకారం నిర్మించమని ఆదేశించడం వలన ఆయన కట్టించారని అక్కడ శిలాశాసనం ద్వారా తెలుస్తోంది. పూర్వం దీనిని కూటాద్రి అని పిలిచేవారని, కాలక్రమేణా కురుడుమలె గా పేరు మారిందని చరిత్రకారులు చెబుతారు. ఆర్కియాలజీ వారు ఈ గుడి సుమారు 2వేల సంవత్సరాల  క్రితందని చెబుతారు. ఈ గుడి మొత్తం ఏక శిలతో నిర్మితమయింది.

కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి ఆలయం ఈ ఆలయానికి వంద మీటర్ల దూరంలో కౌండిన్య మహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించిన వారి అనుగ్రహం పొందుతారు. కౌండిన్య మహాముని ఆ ప్రాంతంలో నేటికీ ఉంటారని, ప్రతీ రాత్రి వచ్చి స్వామిని సేవించుకుంటారని అక్కడ నమ్మకం. దానికి ఆధారంగా కొన్ని రాత్రులు అక్కడ స్తోత్రాలు వినబడతాయని, ఓంకారం ప్రతిధ్వనిస్తుందని పర్వదినాలలో దేవతలు స్వామిని సేవించుకుంటారు అని అక్కడ పెద్దలు చెబుతారు.

ఇక్కడ ప్రాశస్త్యం ఏమిటంటే ...

అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే స్వామి దర్శన మాత్రం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి. కొత్త పని మొదలు పెట్టేముందు, బాధలతో సతమతమయ్యేవారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు జరుగుతాయని చరిత్ర. నేటికీ కూడా కన్నడ ప్రజలు తప్పక దర్శించి మంచి ఫలితాలు చూస్తారు.

ఈ గుడికి ఒక వంద మీటర్ల దూరంలో కౌండిన్యమహర్షి ప్రతిష్టితమైన సోమేశ్వరస్వామి, అమ్మవారిని కూడా దర్శించి వారి అనుగ్రహం పొందవచ్చు. శనివారం దర్శనానికి వెళ్తూ అక్కడ వేంకటేశుని ధర్శనమయితే బావుండునని అనుకున్నాను. ఆశ్చర్యంగా సోమేశ్వర స్వామి దేవాలయంలో అడుగిడగానే ఆరడుగుల స్వామి వారి విగ్రహం శ్రీదేవి భూదేవి సమేతంగా దర్శనమిచ్చి అనుగ్రహించారు. అక్కడే 1600 ఏళ్ళ సోమేశ్వర స్వామి, అమ్మవార్లు విగ్రహాలు అనుగ్రహిస్తాయి. వీరు తమ కుమారుని బాగోగులు దగ్గరుండి చూసుకుంటారని అక్కడ అనుకుంటారు. మనకు మంచి సమయం వస్తే కానీ ఇక్కడ గణపతి స్వామి దర్శనం దొరకకపోవడం కొసమెరుపు. ఆయన ఆజ్ఞా లేనిదే అక్కడకు వెళ్ళలేము.

ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు

ఏదైనా కొత్త పని మొదలు పట్టే ముందు, బాధలతో సతమతమయ్యే వారు తప్పక దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా అద్భుతంగా పనులు పూర్తి అవుతాయని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయన్ని ప్రతి నిత్యం వందల కొద్ది భక్తులు సందర్శించి దేవుని ఆశీర్వాదాలు పొందుతుంటారు.