బీజేపీకి మోడీ విరాళం రూ.1000

బీజేపీకి మోడీ విరాళం రూ.1000

న్యూడిల్లీ:  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి వెయ్యి రూపాయలు డొనేషన్​ఇచ్చారు. ఈమేరకు డొనేషన్​రసీదును ట్విట్టర్​లో షేర్​ చేస్తూ.. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని పార్టీ కేడర్​కు పిలుపునిచ్చారు. “నేను బీజేపీ ఫండ్‌‌ కోసం రూ.1,000 విరాళం ఇచ్చాను. డొనేషన్​తో బీజేపీ బలోపేతానికి, తద్వారా బలమైన దేశ నిర్మాణానికి సహాయపడండి”అని ప్రధాని ట్వీట్​చేశారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కూడా పార్టీకి రూ.1,000 డొనేట్ ​చేశారు. “నమో యాప్​ద్వారా బీజేపీని బలోపేతం చేయడంలో నా వంతు సహకారం అందించాను. మీరు కూడా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొని బీజేపీని శక్తిమంతం చేయొచ్చు’’ అని నడ్డా ట్వీట్ చేశారు. మాజీ ప్రధాని వాజ్​పేయి జయంతి సందర్భంగా శనివారం బీజేపీ పార్టీ ఫండ్​ డొనేషన్​ డ్రైవ్ ప్రారంభించింది. ఇందు​లో భాగంగా ప్రధాని, నడ్డా విరాళాలు ఇచ్చారు.