‘ఆటమ్ మొబైల్’​ వేడర్ కు ఏఆర్​ఏఐ అప్రూవల్

‘ఆటమ్ మొబైల్’​ వేడర్ కు ఏఆర్​ఏఐ అప్రూవల్

హైదరాబాద్​, వెలుగు: ఎలక్ట్రిక్ టూవీలర్లు తయారు చేసే హైదరాబాద్​ స్టార్టప్ ‘ఆటమ్ మొబైల్’ కు ​చెందిన కొత్త  బైక్​ ‘ఆటమ్​ వేడర్’ కు ఆటోమోటివ్‌‌ రీసెర్చ్‌‌ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్​ఏఐ) సర్టిఫికేషన్​ దక్కింది. ఎలక్ట్రిక్‌‌ వెహికల్స్‌‌, హైబ్రిడ్ వెహికల్స్‌‌ను టెస్టింగ్‌‌ చేసి, వాటికి సర్టిఫికెట్‌‌ను ఈ సంస్థ ఇష్యూ చేస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ను విదేశాల్లో కూడా అంగీకరిస్తారు.  వేడర్‌‌ను ఈ ఏడాదే రోడ్లపైకి  తీసుకొస్తామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త కేఫ్ రేసర్ మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2.4 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, పటిష్టమైన ట్యూబులర్ ఛాసిస్, ఎల్​ఈడీ ఇండికేటర్  ఎల్​ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంటాయి.  ఒక్కసారి ఛార్జ్‌‌‌‌‌‌‌‌ చేస్తే 100 కి.మీ నడుస్తుంది. మాగ్జిమమ్​ స్పీడ్​ 65 కిలోమీటర్లు. దీనికి గేర్లు, క్లచ్​, లెగ్ బ్రేక్ ​ ఉండవు. వేడర్ ​బైక్‌‌‌‌‌‌‌‌లను పటాన్‌‌‌‌‌‌‌‌చెరులోని కంపెనీ నెట్ జీరో ఫెసిలిటీలో తయారు చేస్తున్నారు.  ఇటీవల దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని సంవత్సరానికి 25,000 యూనిట్ల నుంచి 3 లక్షల యూనిట్లకు పెంచారు. ఈ ఫ్యాక్టరీని 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు.

"భారత ఎలక్ట్రిక్​ వెహికల్స్​ సెక్టార్ ​వేగంగా ఎదుగుతోంది. ఎక్కువ భద్రత,  తక్కువ ఖర్చుతో ప్రోడక్టులను ఇవ్వడంపై మేం ఫోకస్​ చేస్తాం. భద్రత కోసం ‘వేడర్’ ​లో ప్రత్యేకంగా  క్యూరేటెడ్ సేఫ్టీ స్విచ్‌‌‌‌‌‌‌‌లను, హై-ఎండ్ టైర్లను అమర్చాం. మా ఆర్​&డీ ఇంజనీర్ల సహాయంతో  భారతీయ రోడ్లకు అనువుగా ఉండే తాజా వెర్షన్‌‌‌‌‌‌‌‌ను రూపొందించగలిగాం. ట్రాఫిక్​ సమయంలోనూ నడపడానికి ఇది అనువుగా ఉంటుంది. మా లో స్పీడ్ బైక్ లకు చక్కటి ఆదరణ వచ్చింది. ‘వేడర్’​ వల్ల మా ఈవీ బిజినెస్​ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది” అని వేడర్ కు సర్టిఫికేషన్​ రావడంపై ‘ఆటమ్ మొబైల్’​  ఎండీ గడ్డం వంశీకృష్ణ స్పందించారు.