హైదరాబాద్, వెలుగు: సోలార్ పవర్తో ఈవీ ఛార్జింగ్ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్ కంపెనీ ‘ఆటమ్ ఛార్జ్’ కేవలం ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 250 యూనివర్సల్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ల ఇన్స్టాలేషన్ను పూర్తి చేసినట్లు తెలిపింది. మహారాష్ట్రలో 36, తమిళనాడులో 44, తెలంగాణలో 48, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో 23 చొప్పున, ఉత్తరప్రదేశ్లో 15, హర్యానాలో 14, ఒడిశాలో 24 స్టేషన్లు ఏర్పాటు చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. చిన్న పట్టణాలు, నగరాలల్లో ఛార్జింగ్ నెట్వర్క్ను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ ప్రకటించింది. రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. గత ఏడాది సెప్టెంబర్లో తొలిసారిగా ఆటమ్..హైదరాబాద్లో ఛార్జింగ్ సౌకర్యాన్ని కంపెనీ ఏర్పాటు చేసింది. ఇంటిగ్రేటెడ్ సోలార్ రూఫ్ నుంచి తీసుకునే సోలార్ పవర్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ను ఛార్జ్ చేయడం ఆటమ్ ప్రత్యేకత ‘‘సాధారణ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు థర్మల్ పవర్ను ఉపయోగించి కరెంటును తీసుకుంటాయి. దీనివల్ల పవర్ గ్రిడ్పై అదనంగా ఒత్తిడి ఉంటుంది. మేం పూర్తిగా సోలార్ పవర్తోనే ఛార్జ్ చేస్తాం. 250 ఛార్జ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ప్రారంభించడం ద్వారా దేశంలో ఈవీ ఎకోసిస్టమ్కు సపోర్ట్ చేస్తున్నాం. థర్మల్ పవర్ స్టేషన్లను తొలగించి వాటి స్థానంలో సోలార్ పవర్తో నడిచే స్టేషన్లను ఏర్పాటు చేయడం మా టార్గెట్. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇంపార్టెన్స్ ఇస్తాం. కాలుష్య నిర్మూలనకు మా వంతు సాయపడతాం’’ అని ఆటమ్ ఛార్జ్ ఫౌండర్ వంశీ గడ్డం అన్నారు. కంపెనీ ప్రస్తుతం 4- కిలోవాట్ల కెపాసిటీ ప్యానెళ్లను ఇన్స్టాల్ చేసింది. ఇవి అన్ని రకాల ఈవీలను ఛార్జ్ చేస్తాయి.- ఒక్క ఈవీని ఛార్జ్ చేయడానికి దాదాపు6-–8 గంటల సమయం పడుతుంది. రోజుకు 12 వెహికల్స్ను ఛార్జ్ చేయొచ్చు. కంపెనీ త్వరలో 6 కిలోవాట్ల ఛార్జర్లను కూడా ఇన్స్టాల్ చేయనుంది. ఒక్కో ఛార్జర్ రోజుకు 30 వరకు వెహికల్స్ను ఛార్జ్ చేస్తుంది. సోలార్పవర్ను ఇవ్వడానికి ఆటమ్ ఛార్జ్ ఇతర ఛార్జింగ్ స్టేషన్ల ఓనర్లతో ఒప్పందాలు కుదుర్చుకుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
