డిసెంబర్ 16 అనగానే నిర్భయ ఘటన గుర్తుకొస్తుంది

డిసెంబర్ 16 అనగానే నిర్భయ ఘటన గుర్తుకొస్తుంది

ఏ ఆడపిల్లకు కూడా నిర్భయలాంటి పరిస్థితి రావొద్దన్నారు ఆమె తల్లి ఆశాదేవి. డిసెంబర్ 16 అనగానే నిర్భయ ఘటన గుర్తుకొస్తుందని.. ఇలాంటి కేసుల్లో దోషులకు వెంటనే శిక్షలు పడాలన్నారు. 8 ఏళ్ల పోరాటం కారణంగానే… నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష పడిందన్నారు. దేశంలో ఎందరో నిర్భయలు ఉన్నారనీ… వారందరికీ న్యాయం జరిగేవరకు పోరాడుతామని అన్నారు మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయానా.