దక్షిణాప్రికాలో వర్ణవివక్షపై పోరాడిన టుటు కన్నుమూత

దక్షిణాప్రికాలో వర్ణవివక్షపై పోరాడిన టుటు కన్నుమూత

సౌతాఫ్రికాలో వర్ణవివక్షపై పోరాడిన  నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్  డెస్మండ్ టుటు(90) ఇవాళ కన్నుమూశారు.  ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా వెల్లడించారు.  విముక్తి కోసం పోరాడిన గొప్ప వ్యక్తుల్లో ఒకరిని కోల్పోయామన్నారు.  ఆయన మృతిపట్ల సంతాపం తెలిపారు. టుటు లేని లోటు పూడ్చలేనిదన్నారు.  టుటు అలుపెరగని కార్యకర్త, అతను సౌతాఫ్రికలో తెల్లజాతి మైనారిటీ పాలనకు వ్యతిరేకంగా పోరాడినందుకు 1984లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.