జనసేన అధినేత పవన్ కల్యాణ్పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే అంటే పవన్ కల్యాణ్ కాదు అని కేకే అని ఆరోపించారు. కేకే అంటే కిరాయి కోటిగాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల ఖమ్మంలో తనపై కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నుంచి కిరాయి తీసుకుంటాడు కాబట్టే ఖండించడని అన్నారు. ప్రగల్భాలు పలికే పవన్ కల్యాణ్ చంద్రబాబును ఏమైనా అంటే మాత్రం రోడ్డుమీదకు వచ్చి పడుకుంటాడని మండిపడ్డారు. గతంలోనూ ముద్రగడ పద్మనాభంపై దాడి జరిగినా పవన్ కల్యాణ్ ఖండించలేదని గుర్తు చేశారు. ఇకపోతే ఖమ్మంలో తనపై దాడి వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దంటూ... దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. తనను భౌతికంగా తొలగించాలని దాడికి యత్నించిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారని తెలిపారు. వారిలో ఆరుగురుని అరెస్ట్ చేశారు. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.
ఆయన పవన్ కళ్యాణ్ కాదు.. కిరాయి కోటిగాడు: ఏపీ మంత్రి అంబటి
- ఆంధ్రప్రదేశ్
- October 30, 2023
మరిన్ని వార్తలు
-
Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
-
Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
-
తిరుపతి తొక్కిసలాట : ఎస్పీ బదిలీ, డీఎస్పీని సస్పెండ్ చేసిన సీఎం చంద్రబాబు
-
పద్ధతి ప్రకారం పనిచేయడం నేర్చుకోండి.. కలెక్టర్, టీటీడీ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.