గుజరాత్ లో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ద్వారకా జిల్లాలోని మోర్బి సమీపంలోని జింజుడాలో 120 కిలోల హెరాయిన్ ను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ స్వాధీనం చేసుకుంది. లోకల్ పోలీసులతో కలిసి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఈ ఆపరేషన్ నిర్వహించింది. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ కోట్లలో ఉంటుందని అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ 600 కోట్లు ఉంటుందన్నారు గుజరాత్ డీజీపీ ఆశిష్ భాటియా. హెరాయిన్ ను పాకిస్థాన్ నుంచి పడవలో తీసుకొచ్చారని చెప్పారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ సందర్భంగా గుజరాత్ పోలీసుల్ని అభనందించారు ఆ రాష్ట్ర హోం మంత్రి హర్ష సంఘ్వి.
‘ గుజరాత్ పోలీసుల మరో ఘనత. డ్రగ్స్ నిర్మూలనలో గుజరాత్ పోలీసులు ముందున్నారన్నారు. గుజరాత్ ఏటీఎస్ దాదాపు 120 కిలోల డ్రగ్స్ని పట్టుకుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ విషయంపై మరిన్ని వివరాలను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలియజేస్తారన్నారు మంత్రి.
