- లిస్టింగ్ ప్లాన్
న్యూఢిల్లీ: లాభాలతో నడుస్తున్న ఎయిర్టెల్ పేమెంట్బ్యాంక్ను లిస్టింగ్కు తీసుకెళ్లాలని భారతి ఎయిర్టెల్ ప్లాన్ చేస్తోంది. ఈ పేమెంట్ బ్యాంక్ ఏటా రెండంకెల గ్రోత్ సాధిస్తున్నట్లు కంపెనీ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. భవిష్యత్తులో డేటా సెంటర్ బిజినెస్నూ మానిటైజ్ చేసే ఛాన్స్ ఉందన్నారు. 5 జీ సేవలకు ప్రీమియం రేట్లు వసూలు చేసే ఆలోచన ఎయిర్టెల్కు లేదని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని మొబైల్ డివైస్లలో 12 శాతం మాత్రమే ప్రస్తుతం 5జీ ని సపోర్ట్ చేస్తాయని చెప్పారు.
అప్పులలో కూరుకుపోయిన టెలికం ఇండస్ట్రీకి టారిఫ్లు పెంచడం అనివార్యమని అభిప్రాయపడ్డారు. రెండు సర్కిల్స్లో బేస్ రేట్లను పెంచడం అంచనా వేసిన దానికంటే బెటర్ రిజల్ట్స్ ఇస్తోందని పేర్కొన్నారు. ఇతర సర్కిల్స్లోనూ బేస్ రేట్లను పెంచడంపై ఆరు వారాలలో ఎయిర్టెల్ నిర్ణయం తీసుకుంటుందని ఆ సీనియర్ ఆఫీసర్ చెప్పారు. పోటీ కంపెనీలు ఏం చేస్తాయో చూసి, ఎయిర్టెల్ తన నిర్ణయం ప్రకటించాలని భావిస్తోంది.
