మహారాష్ట్ర కోల్గేట్​ డిస్ట్రిబ్యూటర్ల కీలక నిర్ణయం

 మహారాష్ట్ర కోల్గేట్​ డిస్ట్రిబ్యూటర్ల కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: సాధారణ డిస్ట్రిబ్యూటర్లకు, బిజినెస్​టు బిజినెస్​ డిస్ట్రిబ్యూటర్లకు అమ్మే ప్రొడక్టుల ధరల్లో తేడాలను తొలగించాలన్న తమ రిక్వెస్టును పట్టించుకోనందుకు కోల్గేట్​ పామోలివ్ ప్రొడక్టులను వారంపాటు అమ్మబోమని  మహారాష్ట్ర ఎఫ్​ఎంసీజీ డిస్ట్రిబ్యూటర్లు ​స్పష్టం చేశారు. వారం తరువాత కూడా కంపెనీ దిగిరాకుంటే మరింత కఠినంగా వ్యవహరిస్తామని, వేద్​శక్తి బ్రాండ్​ సేల్స్​ను పూర్తిగా నిలిపేస్తామని చెప్పారు. జియోమార్ట్, వాల్​మార్ట్​, మెట్రో, బుకర్​, ఎలాస్టిక్, ఉడాన్​ వంటి బీ2బీ డిస్ట్రిబ్యూటర్లకు తక్కువ ధరలకు, తమకు ఎక్కువ ధరలకు ప్రొడక్టులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై కోల్గేట్​ఎగ్జిక్యూటివ్​ ఒకరు మాట్లాడుతూ సాధారణ డిస్ట్రిబ్యూటర్ల సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్​ చేశామని అన్నారు. ఆలిండియా కన్జూమర్​ ప్రొడక్ట్స్​ డిస్ట్రిబ్యూటర్స్​ ఫెడరేషన్​ మాత్రం కోల్గేట్​ వాదనను ఒప్పుకోవడం లేదు.