బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో తీర్పు చెప్పిన లక్నో సీబీఐ ప్రత్యేక జడ్జీకి అదనపు భద్రత కల్పించారు. మసీదు కూల్చివేతలో ఎలాంటి కుట్ర లేదని, నిందితులంతా నిర్ధోషులేనని జడ్జి తన తీర్పులో ప్రకటించారు. ఈ క్రమంలో కేసు తీవ్రత దృష్ట్యా జస్టిస్ సురేంద్రకుమార్ యాదవ్కు కేంద్ర ప్రభుత్వం పారామిలటరీ భద్రతను ఏర్పాటుచేసింది. సంచలన తీర్పు వెలువరించిన రోజే పదవీ ఆయన విరమణ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ కేసును విచారిస్తుండటంతో ఆయన పదవీ కాలాన్ని ఇప్పటికే పలుమార్లు పొడిగించారు.
