బీఎస్​ఎన్​ఎల్​ నుంచి స్కిప్పర్​కు భారీ ఆర్డర్

బీఎస్​ఎన్​ఎల్​ నుంచి స్కిప్పర్​కు భారీ ఆర్డర్

న్యూఢిల్లీ:  పవర్ కంపెనీ స్కిప్పర్ లిమిటెడ్ ప్రభుత్వ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్​ఎన్​ఎల్​) నుంచి రూ. 2,570 కోట్ల విలువైన కొత్త ఆర్డర్‌‌‌‌లను పొందినట్లు తెలిపింది.  టెలికాం టవర్ల  ఏర్పాటు,  మౌలిక సదుపాయాలు కల్పించడం, డివైజ్​ల ఇన్‌‌‌‌స్టాలేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వంటి పనుల కోసం రూ.2,570 కోట్ల కాంట్రాక్టును దక్కించుకున్నట్టు వెల్లడించింది.

రాజస్థాన్,  ఒడిశాలో ఐదు సంవత్సరాల పాటు క్యాపెక్స్,  ఓపెక్స్ మోడల్‌‌‌‌లో 4జీ ప్రాజెక్టులు అమలు చేస్తుంది.   ఇప్పటికీ ఏ విధమైన మొబైల్ కమ్యూనికేషన్‌‌‌‌ లేని లేదా 2జీ/ 3జీ కనెక్టివిటీ మాత్రమే ప్రాంతాల్లో 4జీ కనెక్టివిటీని అందిస్తారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌లకు స్వదేశీ 4జీ టెక్నాలజీ వాడతామని, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా నిధులు సమకూరుస్తారని స్కిప్పర్​ తెలిపింది.