- 12 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేత
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిమ్రానాలోని ఎలక్ట్రిక్ గోదాంలో మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. అయితే ప్రమాదం చాలా పెద్దదిగా ఉండడంతో చుట్టుపక్కల ఫైర్ స్టేషన్ల నుంచి మొత్తం 12 ఫైరింజన్లను రంగంలోకి దించి మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు అధికారులు తెలుసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
ఆన్లైన్ క్లాసులతో చదువులు ఆగమాగం
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు
