అంతా దైవేశ్చ : 94 ఏళ్ల బామ్మ.. 80 లక్షల రామ నామం రాసింది..

అంతా దైవేశ్చ : 94 ఏళ్ల బామ్మ.. 80 లక్షల రామ నామం రాసింది..

మంథా సుబ్బలక్ష్మి చిన్నప్పటి నుంచి రామనామాన్ని జపం చేస్తూ రాసేశారు. 94 ఏళ్ల మంథా సుబ్బలక్ష్మి భక్తి అమోఘం, అపూర్వం. చిన్నప్పటి నుంచి రామ్‌నామ్‌ రాస్తున్న ఆమె ఇప్పటి వరకు 80 లక్షల సార్లు రామ నామం  రాశారు

కలియుగంలో ఎవరైనా రాముని నామాన్ని జపిస్తే మంచిజరుగుతుందని  పురాణాలలో పేర్కొన్నారు. అంతేకాదు..చాలామంది శ్రీరామ అనే నామాన్ని కోటిసార్లు జపం చేస్తూ రాస్తుంటారు. మరికొంతమంది రాయకపోయినా జపం చేస్తుంటారు. రామనామం జపిస్తూ  దేవాలయాలను సందర్శిస్తారు. భగవంతుని దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిలబడేటప్పుడు కూడా రామ నామాన్ని జపిస్తుంటారు. 

కొంతమంది  ఏళ్ల  తరబడి తపస్సు చేశారని కూడా భక్తులు చెబుతుంటారు . కొందరు ఒంటికాలిపై నిలబడి జపంచేస్తుంటారు.  మరికొందరు సంవత్సరాలుగా నిద్రపోకుండా రామనామాన్ని జపిస్తుంటారు. ఇంకొందరు శ్రీరాముడు,  శ్రీకృష్ణుడు  దర్శనం కోసం ఆత్రుతగా  ఎదురు చూస్తూ ..ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు.   కానీ 94 ఏళ్ల మంథా సుబ్బలక్ష్మి భక్తి అమోఘం, అపూర్వం .. ఆమె ఎక్కడున్నా రామనామం జపిస్తూ ఉంటారు. 

ఒడిశాలోని పండిత కుటుంబంలో జన్మించిన మంథా సుబ్బలక్ష్మి  ఇప్పటివరకు శ్రీరామ నామాన్ని 80 లక్షల సార్లు రాశారు.  త్వరలో తాను శ్రీరామ నామాన్ని  కోటి సార్లు రాస్తానని సుబ్బలక్ష్మి తెలిపారు. తాను చిన్నతనంనుంచి  నిరంతరంగా శ్రీరామ నామాన్ని జపిస్తూ...రాస్తున్నానని  తెలిపారు. ఆధ్యాత్మిక  కుటుంబంలో పెరిగిన మంథా సుబ్బలక్ష్మి ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగిన  ఓ ఆధ్యాత్మిక శిబిరం ప్రేరణతో  శ్రీరామ నామాన్ని  కోటిసార్లు జపం చేస్తూ రాయాలని  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆమె భర్త దివంగత సర్వేశ్వర శాస్త్రి కూడా శ్రీరామ నామాన్ని జపించేవారు.

మంథా సుబ్బలక్ష్మి ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లోని చంబాలో నివసిస్తోంది. ఇక్కడ ఆమె రాముని పేరు రాయడం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తున్నారు. కలియుగ అధరా, సుమీర్ సుమిర్ నర్ ఉత్ రాహి పరా అనే పేరులో మాత్రమే ఉందని చెబుతారు. అంటే కలియుగంలో కేవలం రాముని నామం జపించే వారు అనుకున్న కార్యాలను సాధిస్తారని అర్దం. రామకోటి అంటే శ్రీరామ నాామాన్ని  కోటి సార్లురాయటం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. పచ్చరంగు శ్రేయస్సుకు సూచకమని అందుకే రామ కోటిని ఆ రంగు పెన్నులతో రాయాలని పండితులు సూచిస్తున్నారు.