ఈ ఏడాది ఐపీఓల ద్వారా రూ. 1,460 కోట్ల సమీకరణ

ఈ ఏడాది ఐపీఓల ద్వారా రూ. 1,460 కోట్ల సమీకరణ

ముంబై: గతంలోని పబ్లిక్​ ఇష్యూలకు ఇన్వెస్టర్ల ఆదరణ దొరకడంతో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్​ మధ్య కాలంలో 87 ఎస్​ఎంఈ (స్మాల్​ అండ్​ మీడియం ఎంటర్​ప్రైజస్​)లు ఐపీఓల ద్వారా రూ. 1,460 కోట్లను సమీకరించాయి. అంతకు ముందు పూర్తి ఏడాదిలో 56 ఎస్​ఎంఈలు ఐపీఓల ద్వారా రూ. 783 కోట్లు మాత్రమే సేకరించాయి. ఎస్​ఎంఈ ప్లాట్​ఫామ్​పై ఈ ఏడాది మిగిలిన మూడు నెలల్లో మరిన్ని స్ట్రాంగ్​ కంపెనీలు ఐపీఓలకు వస్తాయని అంచనా వేస్తున్నారు. టెక్​ బేస్డ్​ బ్రోకింగ్​ ప్లేయర్లు ఎస్​ఎంఈ ప్లాట్​ఫామ్​ డెవలప్​మెంట్​కోసం మరింతగా పనిచేసే అవకాశం ఉందని ఫెడెక్స్​ సెక్యూరిటీస్​ డైరెక్టర్​ ఉదయ్​ నాయర్​ చెప్పారు. ఎస్​ఎంఈల కోసం ప్రత్యేకంగా ఏర్పాటయిన ప్లాట్​ఫామ్​ చిన్న కంపెనీలకు బాగా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. తమకు కావల్సిన క్యాపిటల్​ను  కంపెనీలు ఇక్కడ సేకరించగలుగుతున్నాయని అన్నారు. 

ఎస్​ఎంఈ సెగ్మెంట్లో బేరిష్​నెస్​ లేదు....

స్టాక్​మార్కెట్లోని బేరిష్​ ఎఫెక్ట్​ ఎస్​ఎంఈ సెగ్మెంట్​లో కనబడటం లేదని, దీంతో ఇన్వెస్టర్లు కూడా చిన్న కంపెనీల ఐపీఓల కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి. బీఎస్​ఈ ఎస్​ఎంఈ, ఎన్​ఎస్​ఈ ఎమర్జ్​ ప్లాట్​ఫామ్​లపై ఐపీఓలకు వచ్చేందుకు ఇప్పటికే  కొన్ని కంపెనీలు డాక్యుమెంట్లను ఫైల్​ చేసుకున్నాయని హేమ్​ సెక్యూరిటీస్​ డైరెక్టర్​ ప్రతీక్​ జైన్​ వెల్లడించారు. ఇండస్ట్రీ డేటా ప్రకారం 2022లో ఇప్పటిదాకా మొత్తం  87 చిన్న కంపెనీలు  ఐపీఓలు చేసి, రూ. 1,460 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. ఐటీ, ఆటోమోటివ్​ కాంపోనెంట్స్​, ఫార్మా, ఇన్​ఫ్రాస్ట్రక్చర్​, హాస్పిటాలిటీ, జ్యుయెలరీ రంగాలలోని కంపెనీలు ఈ ఐపీఓలు చేపట్టాయి. ఒక్క సెప్టెంబర్​ 2022 నెలలోనే ఏకంగా 29 చిన్న  కంపెనీలు మార్కెట్​ తలుపుతట్టాయి. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్​లో ఎస్​ఎంఈ ఐపీఓల సంఖ్య కేవలం తొమ్మిదే. సెప్టెంబర్​లో వచ్చిన 29 ఐపీఓలలో 25 ఇప్పటికే ముగియగా, మరో 4 ఇంకా నడుస్తున్నాయి. ఈ ఎస్​ఎంఈ ఐపీఓలకు క్వాలిఫైడ్​ ఇన్​స్టిట్యూషనల్​ ఇన్వెస్టర్లు, రిటెయిల్​ ఇన్వెస్టర్ల నుంచి మంచి ఆదరణ దొరుకుతోంది. ఇన్సొలేషన్​ ఎనర్జీ ఐపీఓ ఈ కోవకే చెందుతుంది. ఈ ఐపీఓ కిందటి వారమే ముగిసింది. ఇన్సొలేషన్​ ఎనర్జీ ఐపీఓ ఏకంగా 183 రెట్లు ఎక్కువగా సబ్​స్క్రిప్షన్​ సాధించింది. బీఎస్​ఈ ఎస్​ఎంఈ ఐపీఓ ప్లాట్​ఫామ్​పై ఏదైనా ఒక ఎస్​ఎంఈ ఐపీఓకి ఇంత ఆదరణ రావడం ఇదే మొదటిసారి. ఎస్​ఎంఈ ప్లాట్​ఫామ్​పై చిన్న కంపెనీల ఐపీఓలకు దొరుకుతున్న ఆదరణే మరిన్ని చిన్న కంపెనీలకు ప్రేరణగా నిలుస్తోందని హేమ్​ సెక్యూరిటీస్​ డైరెక్టర్​ గౌరవ్​ జైన్​ పేర్కొన్నారు. ఈ ఐపీఓలు సైజులో చిన్నవైనా ఇన్వెస్టర్లకు ఇష్టంగా మారాయని అన్నారు. సెకండరీ మార్కెట్లో బేరిష్​నెస్​తో మెయిన్​ మార్కెట్లలో కొంత స్థబ్దత నెలకొన్నప్పటికీ, ఎస్​ఎంఈ ప్లాట్​ఫామ్స్​ దూసుకెళ్లడం విశేషమని చెప్పారు. ఇటీవలి నెలల్లో  మెయిన్​ప్లాట్​ఫామ్స్​పై ఐపీఓలు గణనీయంగా తగ్గాయి.  చిన్న కంపెనీలకు నిధుల సేకరణ ఈజీ చేయాలనే లక్ష్యంతో 2012లో బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలు రెండూ ఎస్​ఎంఈ ప్లాట్​ఫామ్స్​ను లాంఛ్​ చేశాయి. ఎస్​ఎంఈ సెక్టార్లోని కంపెనీలకు దీంతో నిధుల సేకరణ ఈజీ అయింది.