న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు వచ్చే ఏడాది హైదరాబాద్తోపాటు గురుగ్రామ్, బెంగళూరు, కోల్కతా, ముంబై, చండీగఢ్, ఢిల్లీ, జామ్నగర్, అహ్మదాబాద్, చెన్నై, లక్నో, పూణే, గాంధీనగర్లో 5జీ సేవలను మొదలుపెడతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికం (డాట్) ప్రకటించింది. మేజర్ టెల్కో ఆపరేటర్లు జియో, వీఐ, ఎయిర్టెల్ ఇదివరకే 5జీ ట్రయల్స్ కూడా పూర్తి చేశాయి. ఈ టెక్నాలజీని డెవలప్ చేయడానికి బాంబే, ఢిల్లీ, హైదరాబాద్, మద్రాస్, కాన్పూర్ ఐఐటీల సాయాన్ని డాట్ తీసుకుంది.
