ఒక్క రోజే 18.89 లక్షల రిటర్నులు

ఒక్క రోజే 18.89 లక్షల రిటర్నులు

న్యూఢిల్లీ: చివరి రోజు దగ్గరవుతుండటంతో డిసెంబర్​ 28 ఒక్క రోజే 18.89 లక్షల రిటర్నులు ఫైలయినట్లు ఐటీ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. 2020–21 ఫైనాన్షియల్​ ఇయర్​కు ఇప్పటిదాకా ఫైలయిన రిటర్నుల సంఖ్య దీంతో మొత్తం 4.86 కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇండివిడ్యువల్స్​కు ఐటీ రిటర్నుల ఫైలింగ్​ గడువును ఈ ఏడాది అయిదు నెలలు పొడగించిన విషయం తెలిసిందే. ఈ గడువు డిసెంబర్​ 31 తో ముగియనుంది. అంతకు ముందు ఫైనాన్షియల్​ ఇయర్లో మొత్తం 5.95 కోట్ల ఐటీ రిటర్నులు ఫైలయ్యాయి.

ఈ–వెరిఫికేషన్​ గడువు పెరిగింది....
ఫైనాన్షియల్​ ఇయర్​ 2019–20 కి ఫైల్​ చేసిన ఐటీ రిటర్నుల ఈ– వెరిఫికేషన్​ ప్రాసెస్​కు ఫిబ్రవరి 28, 2022 దాకా అవకాశం ఇస్తున్నట్లు ఐటీ డిపార్ట్​మెంట్​ ప్రకటించింది. ఆన్​లైన్​లో ఐటీ రిటర్ను ఫైల్​ చేశాక, ఆధార్​ ఓటీపీ లేదా నెట్​ బ్యాంకింగ్​ ద్వారా ఈ–వెరిఫికేషన్​ చేయాలనే విషయం తెలిసిందే. రిటర్ను ఫైల్​ చేసిన 120 రోజుల లోపు ఈ–వెరిఫికేషన్​ పూర్తవ్వాలి. ఒకవేళ ఇలా కాకుంటే, బెంగళూరులోని సెంట్రలైజ్డ్​ ప్రాసెసింగ్​ సెంటర్​ (సీపీసీ)కి ఫైల్​ చేసిన ఐటీఆర్​ ఫిజికల్​ కాపీని పంపించొచ్చు. వెరిఫికేషన్​ ప్రాసెస్​ పూర్తి కాకపోతే రిటర్ను ఫైల్​ చేయనట్లుగానే పరిగణిస్తారు. ఫిబ్రవరి నెలాఖరు లోపు ఈ–వెరిఫికషన్​ ప్రాసెస్​ను తప్పనిసరిగా​ పూర్తి చేయాల్సిందిగా ఎసెసీలకు సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ డైరెక్ట్​ ట్యాక్సెస్​ (సీబీడీటీ) సూచించింది.