తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తిరునళ్వేళిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో బాత్ రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మేనేజ్ మెంట్ పై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం
