భారత్ బార్డర్‌‌‌‌‌లోకి పాక్ బాలికలు.. గుర్తించిన ఆర్మీ

భారత్ బార్డర్‌‌‌‌‌లోకి పాక్ బాలికలు.. గుర్తించిన ఆర్మీ

పూంఛ్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు అనుకోకుండా భారత్ బార్డర్‌‌లోకి ప్రవేశించారు. జమ్మూ కశ్మీర్‌‌లోని పూంఛ్ సెక్టార్‌‌లో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి ఆ బాలికలు భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు సమాచారం. ఆదివారం పొద్దున ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సదరు బాలికలు పీవోకేలోని అబ్బాస్‌‌పూర్‌‌కు చెందిన వారుగా అనుమానిస్తున్నారు. వాళ్లు సరిహద్దులను దాటడాన్ని మన బలగాలు గుర్తించాయని, వారికి ఎలాంటి హాని తలపెట్టలేదని ఆర్మీ తెలిపింది. బాలికలను తిరిగి స్వదేశానికి పంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంది.