బూట్లలో 10 కోట్ల విదేశీ​ కరెన్సీ

బూట్లలో 10 కోట్ల విదేశీ​ కరెన్సీ

న్యూఢిల్లీ : ఢిల్లీ ఇంటర్నేషనల్ ​ఎయిర్​పోర్ట్​లో పెద్ద ఎత్తున విదేశీ ​కరెన్సీ పట్టుబడింది. శుక్రవారం తజికిస్తాన్​కు చెందిన ఒక బాలుడు సహా ముగ్గురు ప్యాసింజర్ల నుంచి రూ.10 కోట్ల విదేశీ​ కరెన్సీని కస్టమ్స్​ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

వారు ఇస్తాంబుల్​కు వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్​పోర్ట్​కు రాగా.. లగేజీని చెక్​చేశారు. నిందితులు షూలలో కరెన్సీని దాచి, తమ లగేజీలో పెట్టుకొని తీసుకెళ్తున్నట్టు గుర్తించారు. మొత్తం7,20,000 యూఎస్ ​డాలర్లు, 4,66,200 యూరోలు స్వాధీనం చేసుకున్నారు.

వాటి విలువ ఇండియన్​ కరెన్సీలో రూ.10.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా, ఇండియాలోని ఎయిర్​పోర్ట్​లలో ఇంత పెద్ద మొత్తంలో విదేశీ కరెన్సీ పట్టుబడడం ఇదే మొదటి సారి అని కస్టమ్స్​ అధికారులు పేర్కొన్నారు.