వెరైటీ వెగటు అయ్యింది.. పానీపూరీ యాపారం ఢమాల్

వెరైటీ వెగటు అయ్యింది.. పానీపూరీ యాపారం ఢమాల్

అన్ని సార్లు.. అన్ని వేళల వెరైటీ అనేది పని చేయదు.. కొన్ని కొన్ని ఆహార పదార్థాలు.. సంప్రదాయ బద్దంగా తింటేనే రుచి. అలా కాకుండా వెరైటీకి పోతే వెగటు అయ్యి.. యాపారం ఢమాల్ కావటం ఖాయం. ఇలాంటి ఘటనే ఇప్పుడు గుజరాత్ లో జరిగింది.

పానీపూరీ అనేది ఫేమస్.. ఇటీవల పానీపూరీల్లో వెరైటీ చాలా వచ్చాయి.. దీన్ని చూసిన ఓ వ్యాపారి.. పానీపూరీలో గుజరాతీ సంప్రదాయ ఆహారం అయిన కడినీ జోడించి.. కొత్త పానీపూరీ వ్యాపారం స్టార్ట్ చేశాడు. రెండింటికీ రెండు వెరైటీలు..

కధి పానీపూరి అనే గుజరాతీ వెర్షన్ ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ అవుతోంది. సాంప్రదాయ పానీ (పుదీనా, కొత్తిమీర, పచ్చి మిరపకాయలు మొదలైనవి) పూరీలకు బదులుగా ఈ సారి కొత్తగా గుజరాతీ కధితో పానీ పూరీలు ముందుకొచ్చాయి. ఇది చిక్కటి గ్రేవీ లేదా శనగపిండి, పుల్లని పెరుగుతో కూడిన సూప్. కధిని సాధారణంగా రోటీ లేదా అన్నంతో ఆస్వాదిస్తారు. కానీ ఈ సారి పానీపూరీతో సర్వ్ చేయడంతో నెటిజన్లు విస్మయానికి గురవుతున్నారు.

ఈ కొత్త రకం పానీ పూరీపై మరికొందరు అసహ్యం వ్యక్తం చేస్తున్నారు. పానీ పూరీకి న్యాయం చేయండి అంటూ మరికొందరైతే కామెంట్స్ సెక్షన్ లో ఉద్యమమే చేపట్టారు. ఇటువంటి వెరైబీ కాంబినేషన్ పానీ పూరీలు పుట్టుకురావడం ఇదేం తొలిసారి కాదు. గతంలో ఓ స్ట్రీట్ వెండర్.. అరటిపండు పానీ పూరీని తయారు చేసి చూపించాడు. ఇందులో బంగాళాదుంపలకు బదులుగా అరటిపండును ఉపయోగించాడు. వాటికి తోడు మసాలా దినుసులు, కొత్తిమీర ఆకులను జోడించి ఈ ప్రత్యేకమైన ఫుడ్ కు మరింత వైవిధ్యాన్ని జోడించాడు.