క్యాబ్​ సర్వీసులపైనా బాదుడే!

 క్యాబ్​ సర్వీసులపైనా బాదుడే!
  •     ఫుడ్​ డెలివరీపై 5శాతం జీఎస్టీ  
  •     ఫుట్​వేర్​పై ఇక నుంచి 12 % జీఎస్టీ


కొత్త ఏడాదిలో కొన్ని వస్తువులు, సేవలకు మరింత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక నుంచి ఫుడ్​డెలివరీపై ఐదుశాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఫుట్​వేర్​పై జీఎస్టీని ఐదుశాతం నుంచి 12 శాతానికి పెంచారు. క్యాబ్​ బుక్​ చేసుకున్నా ఐదు శాతం జీఎస్టీ కట్టాలి. ఈ కొత్త రూల్స్​ శనివారం నుంచి అమల్లోకి వచ్చాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆన్​లైన్​ ఫుడ్​ ఆర్డర్లపై స్విగ్గీ, జొమాటో వంటి డెలివరీ సంస్థలు ఇక నుంచి ఐదుశాతం ఎక్కువ వసూలు చేస్తాయి. ప్రస్తుతం రెస్టారెంట్లే జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి కడుతున్నాయి. ఉబర్​, ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్లు టూ, త్రీవీలర్ల బుకింగ్స్​కు ఐదుశాతం జీఎస్టీ వసూలు చేస్తాయి. అన్ని రకాల ఫుట్​వేర్​పై ఇక నుంచి ఐదు శాతానికి బదులు 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి జీఎస్టీ చట్టంలో కొన్ని మార్పులను అమలు చేస్తున్నారు. ఇక నుంచి పర్చేజ్​ రిటర్న్​లో క్రెడిట్​ కనిపిస్తేనే ఇన్​పుట్​ట్యాక్స్​ క్రెడిట్ పొందడానికి వీలుంటుంది.  ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ట్యాక్స్​బకాయిలను వసూలు చేయడానికి ఆఫీసర్లకు సంబంధిత సంస్థ ఆఫీసుకు వెళ్లడానికి అధికారాలు ఉంటాయి.