- స్పాట్లోనే ఎంప్లాయీస్ మృతి
- ముంబైలో ఘటన
ముంబై : ముంబైలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ లో తలెత్తిన లోపాన్ని సరిచేస్తున్న ముగ్గురు సిబ్బంది పై నుంచి లోకల్ట్రెయిన్దూసుకెళ్లింది. దీంతో ఆ ముగ్గురు ఎంప్లాయీస్స్పాట్లోనే చనిపోయారు. పాల్ఘర్ జిల్లాలోని వసాయ్ రోడ్ – నైగావ్ స్టేషన్ల మధ్య సోమవారం రాత్రి 8.55 గంటలకు ఈ సంఘటన జరిగింది.
మృతులను డబ్ల్యూఆర్ ముంబై డివిజన్లోని సిగ్నలింగ్ విభాగానికి చీఫ్ సిగ్నలింగ్ ఇన్స్పెక్టర్ వాసు మిత్ర, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్ మెయింటెయినర్ సోమనాథ్ ఉత్తమ్ లంబుత్రే, హెల్పర్ సచిన్ వాంఖడేగా గుర్తించారు. సోమవారం సాయంత్రం వాసాయి టౌన్దగ్గర్లో సిగ్నలింగ్ సిస్టమ్ లో లోపం తలెత్తింది.
దీంతో ఆ ముగ్గురు స్పాట్కు చేరుకొని లోపాన్ని సరిచేసే పనిలో నిమగ్నమై ఉండగా.. దక్షిణ ముంబైలోని చర్చ్గేట్ టెర్మినస్ వైపు వెళ్తున్న లోకల్ ట్రెయిన్ ఆ ముగ్గురి పైనుంచి దూసుకెళ్లింది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు స్పాట్కు చేరుకుని మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కొక్కరి కుటుంబానికి రూ.55వేల చొప్పున చెల్లించారు
