
హైదరాబాద్సిటీ, వెలుగు: కొత్తగూడలోని పాలపిట్ట సైక్లింగ్ పార్కులో వాటర్బోర్డు నిర్మిస్తున్న సీవేజ్ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను ఈడీ మయాంక్ మిట్టల్ శుక్రవారం పరిశీలించారు. ప్రాజెక్టర్డైరెక్టర్ ఆయనకు పనుల పురోగతిని వివరించారు. వారంలోపు పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని మయాంక్మిట్టల్సూచించారు. గార్డెనింగ్, ల్యాండ్ స్కేప్ పనులు చేపట్టాలన్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఎస్టీపీ సీజీఎం పద్మజ, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.